మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ దారుణ హత్య.. బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ (66) శ‌నివారం రాత్రి దారుణ హ‌త్యకు గురయ్యారు. శనివారం సాయంత్రం ముంబైలో సిద్ధిఖీపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. ఈ ఘటనలో సిద్ధిఖీ కడుపు, ఛాతిపై బుల్లెట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతడిని లీలావతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాంద్రాలో తన కుమారుని కార్యాలయంలో ఉన్న సమయంలో సిద్ధిఖీపై దాడి జరిగింది. బాంద్రా ఈస్ట్‌లోని ఆయన కుమారుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే జీషన్ సిద్ధిక్ కార్యాలయం వెలుపల రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సిద్ధిఖీపై దుండగులు కాల్పులు జరిపారు.