తిరుమలలో కల్తీ ఫుడ్ కలకలం.. పలు హోటళ్లని తనిఖీ చేసిన ఈవో..

పవిత్ర పుణ్యక్షేత్రం  తిరుమలలో కూడా కల్తీ ఫుడ్ కలకలం రేపుతోంది. పలు హోటల్స్ లో  ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, టీటీడీ ఈవో అకస్మాత్తుగా చేసిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ హోటల్స్ లో పాడైన పదార్థాలు దర్శనమిచ్చాయి. ఈ వార్తా శ్రీవారి భక్తులను కలవరపెడుతోంది.