Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకానికి చంద్రబాబు సతీమణి రూ. 1 కోటి విరాళం

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ పథకానికి చంద్రబాబు సతీమణి రూ. 1 కోటి విరాళం ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి తలపెట్టిన ఈ కార్యక్రమానికి తన వంతు మద్ధతుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ విరాళం అందించినట్లు భువనేశ్వరి చెప్పుకొచ్చారు. ఇక రూ. 5కే ఆకలి తీర్చడం అనేది ఎంతో గొప్ప కార్యక్రమన్న భువనేశ్వరి.. పేదలకు, రోజు కూలీలకు, కార్మికులకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. పేదల జీవన ప్రమాణాలు పెరిగేలా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలతో పాటు అభినందనలు తెలియజేశారు. ఎన్ని సంక్షేమ పథకాలున్నా పేదల కడుపు నింపే అన్నక్యాంటీన్ లాంటి కార్యక్రమం మహోన్నతమైదని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. పేదల కోసం ప్రభుత్వం మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని తాను ఆకాంక్షిస్తున్నట్లు భువనేశ్వరి చెప్పుకొచ్చారు.