పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

ఏపీపై అల్పపీడనం ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలుజిల్లాల్లో ఇప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.