గర్భవతికి పురుడు పోసిన 108 సిబ్బంది..

గర్భవతికి పురుడు పోసిన 108 సిబ్బంది.. పెద్డపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామానికి చెందిన బండి సౌజన్య(26)అనే గర్భిణీ స్త్రీని రాత్రి పురిటి నొప్పులు అధికం కావడంతో 108కు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. వెంటనే అక్కడికి చేరుకున్న 108 ఈఎంటీ బాలు, పైలట్ మదన్ నిండు గర్భిణీని పెద్డపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా వెన్నంపల్లి గ్రామ శివారులో మార్గ మధ్యలో పురిటి నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ బాలు, పైలట్ మదన్ సహకారంతో అంబులెన్స్ లో ప్రసవం చేశారు. సౌజన్య ఆడ బిడ్డకు జన్మనివ్వగా, తల్లీ , బిడ్డలు క్షేమంగా ఉన్నారు, మెరుగైన వైద్యం కోసం పెద్డపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డెలివరీ చేసిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద కాలంలో ఆలస్యం చేయకుండా స్పందించి..తల్లీ బిడ్డను కాపాడారని పలువురు 108 గురించి చెప్పుకున్నారు.