భిక్షగాడికి ఐపీ నోటీసు ఇచ్చిన ఖమ్మం వ్యాపారి

ఖమ్మం జిల్ల బోనకల్ మండల కేంద్రంలున్న గీ సాయిబాబా గుడి ముంగట బొచ్చెవట్కోని కూసోని భక్తులతాన అడుక్కుంటుండు సూడు.. గీ బిచ్చగాడు మామూలు బిచ్చగాడు కాదుల్లో.. నర్సింహరావ్ అనే ఒక బేవార్స్ బిజినెస్ మ్యాన్కే 50 వేలు మిత్తికిచ్చే రేంజు బిచ్చగాడట. పేరు గొల్లాల అశోకట.. ఎప్పటిసందో ఈ గుడి ముంగట ఇంటామెతోటి కల్శి అడుక్కతినుకుంట, అటు పక్కకే ఉండే గుడ్శెల బత్కుతుండట. అయితె మూడేండ్ల కింద బిచ్చం అడుక్కుంట పోగేశిన పైసల్లకేలి, ఇగొ గీ నర్సింహరావ్ అనే హోటలాయ్నకు 50 వేలు రూపాలను మిత్తికిచ్చిండట. ఇదే పెద్ద గమ్మతి ముచ్చటాంటె... ఆకులు నాకేటోల్ల మూతులు నాకే రకపోడే ఉన్నట్టుండీ నర్సింహారావనేటాయ్న.. హోటల్ నడిపిచ్చి, కోటి తొంబై ఐదు లక్షల రూపాలు దివాళ తీశినట్టు కోర్టుకు వొయ్ ఐపీ వెటట్టి.. అప్పిచ్చిన 69 మందికి టోపీ వెట్టిండట.