చెయ్యెత్తి బస్సు ఆపని ఈ రోజుల్లో.. ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం అంటూ.. స్వయంగా బస్సు డ్రైవర్ ప్రయాణికులకు స్వాగతం పలకడం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి RTC డిపో కు చెందిన మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచన మేరకు ప్రతి బస్సు ప్రయాణానికి ముందు కండక్టర్ లేదా డ్రైవర్ ప్రయాణికులను ఉద్దేశించి ప్రయాణికు లందరిని ఆత్మీయంగా పలకరించాలి.