ఆర్టీసీ కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ..!

వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం భూపాలపట్నం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికురాలి బందువులు వీరంగం సృష్టించారు. హన్మకొండ డిపో నుండి ఏటూర్‌నాగారం వెళుతుండగా ఆత్మకూరులో వాగ్వాదం జరిగింది. మొదట మహిళా ప్యాసింజర్ తో కండెక్టర్ కు తలెత్తిన వివాదం చెప్పుతో దాడి చేసే దాకా వెళ్లింది. దీంతో ఆర్టీసీ సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.