బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణలో జరిగిన కుంభకోణాలపై పూర్తిగా విచారణ జరుపుతామన్నారు బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్. టీవీ9 మెగా కాన్క్లేవ్లో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఒక కుటుంబం కోసం ఏర్పాటు కాలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 50ఏళ్ల పాటు ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని ధ్వజమెత్తారు.