అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ అటవీ ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తోందని గిరిజనులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా కొందరు ప్రయాణికులు వీడియో తీశారు.