తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక అంతటా వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వార్తల్లో నిలిచింది. వరలక్ష్మి పండగ సందర్భంగా అమ్మవారిని రూ.4.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఉపయోగించి అలంకరించారు. ఈ అలంకరణ కోసం రూ.10 నుంచి రూ.500 నోట్ల వరకూ ఉపయోగించారు. దేవత ధనలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది.