Deity In Srirangapatna Adorned With Rs 4.5L Currency Notes, Karnataka

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక అంతటా వరమహాలక్ష్మి పండుగను ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి ఆలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వార్తల్లో నిలిచింది. వరలక్ష్మి పండగ సందర్భంగా అమ్మవారిని రూ.4.5 లక్షల విలువైన కరెన్సీ నోట్లను ఉపయోగించి అలంకరించారు. ఈ అలంకరణ కోసం రూ.10 నుంచి రూ.500 నోట్ల వరకూ ఉపయోగించారు. దేవత ధనలక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చింది.