రైల్వే బ్రిడ్జిపై రీల్స్‌ చేస్తున్న జంట.. అంతలో దూసుకొచ్చిన రైలు!

రాజస్థాన్‌ పాలిలోని గోరంఘాట్‌ బ్రిడ్జిపై సోషల్‌ మీడియాలో రీల్‌ కోసం శనివారం మధ్యాహ్నం భార్యాభర్తలు వచ్చి ఫొటో షూట్‌ చేస్తున్నారు. అయితే బ్రిడ్జిపైకి అకస్మాత్తుగా ఓ రైలు వచ్చింది. అది ఒకటే ట్రాక్‌ కావడంతో పక్కన నిలబడేందుకు సైతం చోటు లేకపోయింది. దీంతో వారు దిక్కుతోచని స్థితిలో ప్రాణాలకు తెగించి ఏకంగా 90 అడుగుల లోయలోకి దూకేశారు. దీంతో భార్యభర్తలిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.