భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ సాహసం..అడవిలో 8 కి మీ నడుస్తూ.

భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ సాహసం..అడవిలో 8 కి మీ నడుస్తూ. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ వి జితేష్ పాటిల్ సాహసం చేశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు చండ్రుగొండ మండలం బెండల పాడు అడవి ప్రాంతానికి చేరుకున్న అతను... ఎనిమిది కిలోమీటర్లు అడవి మార్గంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి.. పల్లేరు వీరభద్రస్వామి ఆలయంతో పాటుగా.. అటవీ ప్రదేశాన్ని సందర్శించారు. తన ఈ పర్యటనలో ఏ ఒక్క అధికారికి కూడా సమాచారం ఇవ్వకుండా స్వయంగా ఆయనే అక్కడి గ్రామస్తులను వెంట తీసుకొని అడవిలోకి బయల్దేరారు.