సెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోయలో పడిన యువతి

మహారాష్ట్రలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు అక్కడి జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాల కారణంగా చెట్లన్నీ చిగురించి, పచ్చగా కనువిందు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన థేఘర్‌కు పర్యటకులు భారీగా పోటెత్తుతున్నారు. శనివారం పూణెకు చెందిన కొందరు థోస్‌ఘర్ జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చారు. పూణెలోని వార్జేకు చెందిన నస్రీన్ అమీర్ ఖురేషీ (29) అనే యువతి బోరాన్ ఘాట్ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు యత్నించింది. అంతలో జారి 60 అడుగుల లోతైన లోయలో అమాంతం పడిపోయింది.