ఖైదీతో కలిసి టిఫిన్ చేసిన పోలీసులు..

కృష్ణా జిల్లాలో ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది.నిబంధనలకు విరుద్ధంగా మార్గ మధ్యలో వాహనాన్ని ఆపి రిమాండ్ ఖైదీతో కలిసి టిఫిన్ చేయడంపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఎస్కార్ట్ సిబ్బంది ప్రసాద్‌, శివప్రసాద్, కిరణ్‌.. సురేష్‌, ఏఎస్సై శ్రీనివాస్‌పై సస్పెన్షన్‌ వేటు విధిస్తూ ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.