మల్లన్న ఆలయంలో అపచారం.. తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగి.. భక్తుల నిరసన

కొంతమంది మాత్రం పుణ్య క్షేత్రంలో కూడా చెయ్యకూడని పనులు చేస్తూ ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రతను మంట కలుపుతున్నారు. తాజాగా ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయంలో అపచారం జరిగింది. మందు, మాంసాహారం నిషేధం అని తెలిసినా మల్లన్న ఆలయంలో మందు తాగి ఓ ఉద్యోగి విధులకు హాజరయ్యాడు. దీంతో భక్తులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేశారు.