తిరుమల పరకామణి వ్యవహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ చోరీపై సిట్ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో నోటీసులు ఇచ్చి పంపించేశారని ఆరోపించిన మంత్రి..పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చిట్చాట్లో చెప్పారు.