అప్పన్న ఆలయంలో గజేంద్ర మోక్షం వేడుక.. పులకించిన భక్తులు..

దేవుడి పై భక్తి, విశ్వాసం ఉన్నవాళ్లకు దైవ కార్యాలలో జరిగే కొన్ని ఘటనలు అమితాశ్చర్యాన్ని, అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. ఇందుకు తాజా ఉదాహరణ ఇది. కనుమ పండుగ సందర్భంగా సింహాచలం లోని శ్రీశ్రీశ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం లో అత్యంత వైభవంగా జరిగిన స్వామివారి మకర వేట లో నిర్వహించిన గజేంద్ర మోక్షం లో తారా జువ్వల ఎపిసోడ్ భక్తులందరినీ కట్టిపడేసింది.