అయ్యప్ప భక్తులకు శుభవార్త

విశాఖపట్నం - విజయవాడ మధ్య రెండు కొత్త విమాన సేవలు ప్రారంభమయ్యాయి.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ సేవలను విశాఖపట్నంలో ప్రారంభించారు. ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు శుభవార్తని అందించారు. ఇరుముడిని విమానంలో తీసుకెళ్ళడానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. జనవరి 20 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.