అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్.. వైసీపీ కేడర్తో కలిసి ఎన్నికల యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో నిర్వహించిన సిద్ధం సభలకు వైసీపీ కార్యకర్తలు లక్షలాదిగా తరలివచ్చారు. తాజాగా.. రాయలసీమలో అన్ని రహదారులు రాప్తాడుకు దారి తీస్తున్నాయి. ఇవాళ అక్కడ జరగనున్న వైసీపీ సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటన చేయనున్నారా? కొత్త హామీలు ప్రకటించబోతున్నారా? ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉందా? ఎన్నికల మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తారా?