ఏపీ వాసులకు అలెర్ట్.. పొంచి ఉన్న మరో తుఫాన్ గండం..

ఏపీ వైపు మరో తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే భారీ వర్షాలు-వరదలతో అతలాకతలం అయిన రాష్ట్రం  తాజాగా పొంచి ఉన్న తుఫాన్‌ ముప్పుతో అప్రమత్తం అయ్యింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు.