వర్షాలు విస్తారంగా పడటంతో పంటలకు యూరియా డిమాండ్ పెరిగింది. కానీ సరఫరా సరిగ్గా జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే సహకార సంఘాల ఎదుట క్యూ కడుతున్నా యూరియా దొరకకపోవడంతో ఆగ్రహం చెలరేగింది. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పరిస్థితి మరింత విషమించింది.