కేరళలో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు.. శిధిలాల కింద వందలాది మంది..

అన్ని ప్రభుత్వ సంస్థలు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. కార్యకలాపాలు సమన్వయంతో జరుగుతాయి, సహాయ కార్యక్రమాలకు నాయకత్వం వహించడానికి రాష్ట్ర మంత్రులు కొండ జిల్లాకు చేరుకుంటారని సీఎం కార్యాలయం నుంచి విడుదల అయిన ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు  ముండకైలో కొండచరియలు విరిగిపడటంతో రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోవడానికి చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం రోడ్లు అన్నీ కొండ చరియలతో బ్లాక్ చేయబడి ఉన్నాయి.