తిరుమలలో ప్రకృతి అందాలు.. శ్రీవారి దర్శనానికి క్యూ కడుతున్న భక్తులు..

తిరుమల గిరులు ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. శేషాచలం కొండలు మంచు తెరలు కప్పుకొని కనువిందు చేస్తున్నాయి. పచ్చదనం మరింత విచ్చుకుని ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఘాట్ రోడ్లపై ప్రయాణించే భక్తులు వాహనాలు ఆపి ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు.