దుర్గమ్మకు 2.5కోట్ల వజ్రకిరీటాన్ని బహుమతిగా ఇచ్చిన భక్తుడు

నవరాత్రులలో మొదటి రోజు కనక దుర్గమ్మ అమ్మవారి అలంకారాలని అనుసరించి. కనక దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ అమ్మవారి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఎదురుచూస్తున్నారు. కాగా నిర్మలమైన మనసుతో పూజిస్తే కోరిన వరాలు ఇచ్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా పిలుచుకునే కనక దుర్గమ్మకు మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని బహుకరించాడు.