కాలినడకన తిరుమలకు చేరుకున్న హీరో మహేశ్‌ బాబు ఫ్యామిలీ

శ్రీవారిని దర్శించుకునేందుకు హీరో మహేశ్‌ బాబు ఫ్యామిలీ తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడకమర్గాన మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార.. తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించారు. నడక మార్గంలో మెట్లకు పూజలు చేస్తూ కొబ్బరికాయలు కొట్టి కర్పూరం వెలిగించిన నమ్రత శిరోద్కర్ మొక్కులు చెల్లించుకున్నారు. మహేష్ బాబు ఫ్యామిలీ వెంట అభిమానులు కూడా నడిచారు.