నీళ్ల కోసం ఊరి చివరి బావిలో దిగిన గిరిజనులు.. ఒక్కసారిగా కనిపించిన సీన్‌ చూసి పరుగో పరుగు..

నీటికోసం బావి వద్దకు వెళ్లిన తండావాసులకు ఆ నీటిలో కొండచిలువ కనిపించింది.. కొందరు పరుగులు పెట్టగా మరికొందరు ఆ కొండచిలువ ను పట్టుకునే ప్రయత్నం చేశారు.. ఆ కొండచిలువ ఒక వ్యక్తి కాళ్ళు – చేతులకు చుట్టుకోవడంతో మిగిలిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ శివారు టేకులతండా లో జరిగింది…