హైదరాబాద్‌ నగర వీధుల్లో పరుగులు తీస్తున్న ఖరీదైన చేపలు..

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రోడ్ల మీద వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరద నీరు ఉప్పొంగి ప్రజలు ఇళ్లలోకి చొచ్చుకొచ్చాయి. దీంతో ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవల్సిన దుస్థితి నెలకొంది. ఇక చినుకు పడితేనే చిత్తడిగా మారే హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని ఇలాంటి వర్షాభావ పరిస్థితుల్లో ఊహించగలమా?