మల్లన్న ఆలయంలో పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం..

శ్రీశైల క్షేత్రమంతా భక్తజనంతో నిండి సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామునుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది.