ట్యాంక్‌బండ్‌ దగ్గర కొనసాగుతున్న గణేష్‌ నిమజ్జనాలు..

గణపతి నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌, సెక్రటేరియట్‌ దేదీప్యమానంగా వెలిగిపోయాయి. హుస్సేన్‌ సాగర్ తీరమంతా దీపాల కాంతుల్లో తీరొక్క గణపయ్యలతో కనుల విందు చేసింది. రాత్రి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షా 5 వేలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్‌ బండ్ దగ్గర నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య జరుగుతోంది. నిమజ్జనాన్ని వీక్షించేందుకు వేలాదిమంది భక్తులు తరలివచ్చారు.