నైరుతి దీవులైన క్యుషు, షికోకులో వణికిన భూమి

నైరుతి దీవులైన క్యుషు, షికోకులో వణికిన భూమి రిక్టరు స్కేలుపై 7.1గా తీవ్రత నమోదు -- భూకంపం ధాటికి ఊగిపోయిన భారీ బిల్డింగ్‌లు -- ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీసిన జనం -- భారీ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ మియాజాకి, కొచ్చి, ఓయిటా, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో ఇప్పటికే 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.