భూమ్మీద నూకలుంటే.. భూకంపం వచ్చినా బతికిస్తారంటే ఇదే..!

భూమ్మీద బతికే రోజులుంటే.. భూకంపం నుంచి కూడా బతికి బయట పడతారంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఇప్పుడు కడప జిల్లాలో జరిగింది. దూసుకెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడిన ఓ పాప స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. మృత్యుంజయురాలిగా నిలిచింది. అప్పటి వరకు కన్నీరు మున్నీరుగా విలపించిన పాప తల్లిదండ్రులు, చిన్నారి కనిపించడంతో ఆనందంతో పొంగిపోయారు.