మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తులు రద్దీ.. దర్శనానికి 4 గంటల సమయం

స్వామీ అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో భక్తులు బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. మరోపక్క భక్తులు స్వామి అమ్మవారికి రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర అభిషేకార్చనలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు.