ఓర్నీ.. అప్పుడే గణపతిని ప్రతిష్టించారు.. ఇంతలోనే లడ్డూ దొంగతనం..

వినాయక నవరాత్రులు మొదలుకాగానే భక్తుల పూజలు సందడి ఒకవైపు అయితే, లడ్డు దొంగలు మరొక వైపు అన్నట్లుగా ఉన్నారు. అటువంటి సంఘటనే బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ప్రగతి నగర్ లోని ఓ అపార్ట్మెంట్ లో నిన్న వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అర్థరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఓ దొంగ వినాయక మండపంలోకి ప్రవేశించి, గణేషుడి చేతిలోని లడ్డు తీసుకొని ఉడాయించాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరలో రికార్డు అయ్యింది.