మహంకాళీ అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. ప్రత్యేక పూజలు..

సికింద్రాబాద్‌ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. రాజ్‌భవన్‌ నుంచి బయలుదేరి సికింద్రాబాద్‌ వెళ్లిన ప్రధాని మోదీ అక్కడ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రధానితో పాటు ముఖ్యులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించారు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయ అర్చకులు ప్రధాని మోదీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తరువాత అమ్మవారి చిత్రపటాన్ని ఇచ్చి, వేద ఆశీర్వదం అందజేశారు. సికింద్రాబాద్‌ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రధాని మోదీ.. సంగారెడ్డి జిల్లాకు వెళ్లనున్నారు.