శ్రీశైలం క్షేత్రంలో అంకాళమ్మ అమ్మవారికి ఘనంగా బోనం సమర్పణ

ఉదయం ఆలయ మహాద్వారం నుంచి శ్రీస్వామి అమ్మవారి ఆలయాల ప్రధానార్చకులు ఆలయ ఏఈవో హరిదాసు పలువురు అర్చకులు,వేదపండితులు సంప్రదాయ బద్దంగా నూతన పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలు,గాజులు, ఫలపుష్పాలు, నివేదన మొదలైనవాటితో అంకాళమ్మ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అంకాళమ్మ అమ్మవారికి విశేషంగా పూజాదికాలు జరిపి బోనాన్ని సమర్పించారు