కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థి పి.స్వప్న 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రయాన్ పై అర అంగుళం కలిగిన అతిచిన్న సూక్ష్మ కళాకృతిలో జాతీయ పతాకం ఆకృతిని తయారు చేసి అబ్బుర పరచింది. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు యన్.కీర ప్రత్యేక శిక్షణతో ఈ సూక్ష్మకళాకృతిని చేసినట్టు తెలిపింది.