హెచ్ఎండీఏలో విజిలెన్స్ సోదాలు కలకలం రేపుతున్నాయి. హెచ్ఎండీఏ కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. 50 మంది స్పెషల్ టీమ్తో సోదాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఫైల్స్ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైత్రీవనం నాలుగో అంతస్తులో ఉన్న అన్ని ఫైల్స్ను విజిలెన్స్ సీజ్ చేసింది.