ఈవోపై బదిలీ వేటుతో సంబరాల్లో భక్తులు, సిబ్బంది

సత్య ప్రమాణాలకు క్షేత్రం కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయం. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయ ఈవో పై వేటు వ్యవహారం ఇప్పుడు చర్చ గా మారింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సంబరాలు జరుపుకునేందుకు కారణమైంది. 4 ఏళ్లుగా ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న వెంకటేశుపై చర్యలతో స్థానికులు, ఉభయదారులు, ఒప్పంద ఉద్యోగులు, అర్చకులు ఇలా అందరూ బాణా సంచా కాల్చి మరీ సంబరాలు జరుపుకునేలా చేసింది.