చెరువులో తేలియాడిన కారు.. ఒడ్డుకు చేర్చి స్థానికులు షాక్..!

చెరువులో తేలియాడుతున్న కారును గమనించిన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే తాళ్లు, ట్యూబులతో కారు సహా నలుగురిని ఒడ్డుకు చేర్చారు. ముగ్గురు పిల్లలు తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబాన్ని అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్‌కు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారించారు. అయితే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఈ క్రమంలో పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు.