తేళ్లతో ఆటలు... అక్కడ నాగుల పంచమి కాదు... తేళ్ల పంచమి.

దేశంలో ఇవాళ అందరు నాగులపంచమి పండుగ జరుపుకుంటారు. అక్కడ మాత్రం తేళ్ల పంచమి నిర్వహిస్తారు. తేళ్ల విగ్రహాలకు పూజలు చేస్తారు. అక్కడి కొండపై ఉన్న రాళ్ళ కింద తేళ్లతో ఆటలు ఆడుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా... ఇదొక అనాదిగా వస్తున్న ఆచారం. కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లా కందుకూరు గ్రామంలో అనాది గా ఓ వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది.