ఆస్తి పంచుకొని తల్లిని గెంటేసిన కొడుకులు

ఆస్తి పంచుకొని తల్లిని గెంటేసిన కొడుకులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరుకు చెందిన నరసవ్వ దీనస్థితి దారుణంగా తయారైంది. కడుపున పుట్టిన నలుగురు కొడుకులను ఓ ఇంటి వాళ్లను చేసి, ఆస్తుల పంపకాలు చేసి ప్రయోజకులను చేసింది నరసవ్వ. అయితే వృద్దాప్యానికి చేరుకున్న ఆమె ఓ చిన్న గుడిసెలో తల దాచుకుంటూ జీవనం సాగిస్తోంది. చేతులు వణుకుతూ... ఊత కర్ర సాయంతో నడుస్తున్న తనకు కన్నబిడ్డలు అన్నం కూడా పెట్టడం లేదని వాపోయింది. తన పట్ల వివక్ష చూపుతున్న బిడ్డలను పిలిచి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.