ఆషాడ మాసం చివరికి చేరుకోవడంతో భాగ్యనగరంలో బోనాల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ రోజు పట్నం మొత్తం బోనమెత్తింది. వేపాకుల తోరణాలు... పోతరాజుల విన్యాసాలు... శివసత్తుల పూనకాలు... అమ్మవారి పాటల నడుమ సిటీలో గల్లీ గల్లీలో పండుగ సందడి నెలకొంది. అమ్మవారి సేవలో పులకిస్తుంది. గత నెల 26న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఉత్సవాలు ఆషాడ మాసం చివరి ఆదివారం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడంతో ముగియనున్నాయి.