పరిగి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. రైతు తన సొంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకున్న రోజే బంగారు తెలంగాణ అన్నారు. మీ దయతో ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రిని అయ్యానని.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు గులాబీ బాస్.