ఎర్రటి ఎండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య పడిగాపులు కాశారు. ప్రజా సమస్యలు చెబుతామని 4 సార్లు దీనంగా నిలబడ్డారు. అయినా సీఎం కాన్వాయ్ చూసినట్లుగా ముందుకు వెళ్లిపోయింది. కలుసుకునేందుకు సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.