మదనపల్లిలో నాటు తుపాకీ కాల్పుల కలకలం.. మహిళకు గాయాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలంలో నాటు తుపాకీ కాల్పుల వ్యవహరం కలకలం రేపింది. వేటగాళ్ల కాల్పుల్లో తూటా తగిలి మహిళ కు తీవ్ర గాయాల పాలైంది. అపస్మారక స్థితి పడిపోయిన పాపులమ్మ అనే మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అసలేం జరిగిందంటే.. మదనపల్లి మండలం ఆవులపల్లికి చెందిన పాపులమ్మ గ్రామ సమీపంలోని పొలంలో ఉండగా వేటగాళ్లు అడవి జంతువుల కోసం వేటాడే క్రమంలో తూటాకు గురైంది. ఘటనపై ఆరా తీసిన పోలీసులు అనుమానితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీ నీ స్వాధీనం చేసుకున్నారు.