2019 ఎన్నికల్లో 151 స్థానాలతో ఘన విజయాన్ని అందుకున్న వైసిపి 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా 11 స్థానాలకే పరిమితం అయిపోయింది. వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంల వల్లే తమకు ఈ స్థాయి ఫలితాలకు పరిమితం అయ్యామంటూ.. పార్టీ అధినేత నుంచి ముఖ్య నేతలు అందరూ ఇదే మాట్లాడారు.