ఆ గ్రామంలో 80 ఏళ్లుగా వింత ఆచారం అరటిగెలల జాతర ఓ ప్రత్యేకం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు వద్ద అరటి గెలలను భక్తులు కడతారు. అరటి గెలలు కట్టడం కోసం రావి చెట్టు వద్ద ప్రత్యేక పందిళ్లను ఏర్పాటు చేస్తారు నిర్వాహకులు. ఈ ఏడాది మొక్కుల్లో భాగంగా పదివేల వరకు అరటి గెలలు వచ్చాయి. ఇలా ఆలయ ప్రాంగణంలో కట్టిన అరటి గెలలను రెండు మూడు రోజుల అనంతరం అదే భక్తులు వచ్చి కట్టిన గెలలను ఇంటికి తీసుకువెళ్ళి స్వామివారి ప్రసాదంగా అరటి పళ్ళను ఇంటిల్లపాది తింటారు.