ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్ధుబాటు కొలిక్కివచ్చింది. పొత్తులో భాగంగా జనసేన- బీజేపీ 31 అసెంబ్లీ స్థానాలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుంది. వీటిలో జనసేన నుంచి 21 అసెంబ్లీ.. రెండు లోక్ సభ స్థానాలు కాగా.. బీజేపీ 10 అసెంబ్లీ .. 6 ఎంపీ స్థానాల్లో పోటీచేస్తుంది. ఇక టీడీపీ 144 అసెంబ్లీ.. 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.