నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్మెంట్ నుంచి తీవ్రమైన దుర్వాసన వచ్చింది. 15 ఏళ్లుగా కట్టడం నిలిసివేసిన అపార్ట్మెంట్ నుంచి భరించలేని దుర్వాసన.. వస్తుండటంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూశారు.. దీంతో ఒక డెడ్ బాడీ బయటపడింది. గుర్తు తెలియని శవంగా గుర్తించి పోలీసులు వివరాలు సేకరించారు. వేలిముద్రల ఆధారంగా శవం మనోజ్ కుమార్ అనే నేరస్తుడిదని తేలింది. పలు నేరాలు చేస్తూ స్నేహితుల మధ్య వచ్చిన తగాదా హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.